-రాష్ట్రంలో రేవంత్ రాక్షస పాలన
– సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే దృష్టి
– పోలీసు అధికారులు రేవంత్ రెడ్డి కి భయపడాల్సిన అవసరం లేదు
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. హోం మంత్రి కూడా ముఖ్యమంత్రే. రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రేవంత్ ద్వంసం చేస్తున్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం హరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీ ఆర్ ఎస్ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసింది. బీ ఆర్ ఎస్ సభ లోపలా బయటా గణాంకాలతో సహా రేవంత్ తీరును ఎండగట్టింది.
బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షం గా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. మార్చి 15 ,16 తేదీల్లో పదిహేను కేసులు పెట్టారు. రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ హయం లో 2023 లో తెలంగాణ సైబర్ సెక్క్యూరిటీ బ్యూరో ఏర్పడింది.
సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను కాపాడటానికి మంచి ఉద్దేశం తో ఆ బ్యూరో పెట్టారు. గొప్ప దార్శనికత తో దాన్ని స్థాపించారు. రేవంత్ హోమ్ మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను దుర్వినియోగం చేస్తున్నారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరో ను రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు, రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు.
సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే దృష్టి కేంద్రీకరించారు. గాంధీ భవన్ ,బీజేపీ కార్యాలయాలు సైబర్ పెట్రోలింగ్ లో లేవు. రేవంత్ సైన్యం పేరిట కే టీ ఆర్ పై దారుణమైన పోస్టులు పెడితే చర్యలు లేవు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?ఫెయిర్ నెస్ ,పారదర్శకత ఎక్కడుంది ?
గౌతమ్ ,దిలీప్ కొణతం, క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండదు. అయినా కేసులు నమోదు చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. రేవంత్ రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధితుడు,ఇన్వెస్టిగేటర్ ,జడ్జి అన్ని పాత్రలు రేవంత్ రెడ్డి పోషిస్తున్నారు. జైల్లో తనను ఘోరంగా చూశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో అన్నారు.
జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ ఛానల్ అధినేత కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇదే రేవంత్ చెప్పారు. నాగయ్య అనే సహా ఖైదీ తనకు అన్ని చేసిపెట్టారని చెప్పారు. నాగయ్య ను వాడు వీడు కింద కూర్చునే వాడు అంటూ రేవంత్ ఫ్యూడల్ మైండ్ సెట్ ను చాటుకున్నారు. సైబర్ పెట్రోలింగ్ జరగాల్సింది సెక్రటేరియట్ లో.
రేవంత్ అన్న తమ్ముళ్లు చెబితే కానీ సచివాలయం లో ఫైళ్లు కదలడం లేదు. అక్కడ సైబర్ పెట్రోలింగ్ జరగాలి. ఆర్ ఆర్ టాక్స్ యథేచ్ఛగా వషూలు చేస్తున్నారు ..వాటిపై సైబర్ పెట్రోలింగ్ జరగాలి. దిలీప్ కొణతం ,జర్నలిస్టు రేవతి పై వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు ?వారంత తప్పు ఏమి చేశారు? కాంగ్రెస్ బీజేపీ లు కలిసి రాష్ట్రం లో వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాయి. వాటి మీద కేసులు పెట్టాలి. బీ ఆర్ ఎస్ నేతలు ఎన్ని పిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయడం లేదు?
నకిరేకల్ ప్రశ్నా పత్రం లీకేజి కేసులో కే టీ ఆర్ పై మూడు కేసులు పెడతారా ? ఒక్క కేసులో ఒక ఎఫ్ ఐ ఆర్ నే నమోదు చేయాలనీ కోర్టు తీర్పులు ఉన్నాయి. పోలీసు అధికారులు రేవంత్ రెడ్డి కి భయపడాల్సిన అవసరం లేదు. బీ ఆర్ ఎస్ అధికారం లోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తాం. మాకు ఎలాంటి ఫేవర్ చేయనవసరం లేదు నిబంధనల కనుగుణంగా పనిచేస్తే చాలు.
హరీష్ రావు ను పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేత పై పోలీసులు ఎలాంటి కేసు పెట్టలేదు. గాంధీ భవన్ లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. పోలీసు అధికారులు వాటిని యధాతథంగా ఎఫ్ ఐ ఆర్ లుగా నమోదు చేస్తున్నారు. గొర్రెల స్కాం లో కొడంగల్ కు చెందిన ఓ అధికారిని 52 రోజులు ఆకారణంగా జైల్లో పెట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికైనా భాద్యతాయుతంగా పని చేయాలి .లేకపోతే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. తప్పు చేస్తున్న పోలీసు అధికారులకు వారి కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ చేయాలి.
వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
మా నాయకురాలు కల్వకుంట్ల కవిత పై ఎమ్మెల్సీ బలమూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేవంత్ మెప్పు కోసమే వెంకట్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బీసీల గొంతుక అవుతున్నందుకే కవిత పై కాంగ్రెస్ కక్ష గట్టింది. అప్పుల పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని నిరూపించడమే కవిత చేసిన తప్పా ? బీసీ బిల్లు లోపాలు ఎత్తి చూపడమే కవిత చేసిన తప్పా ?
మొదట్నుంచి కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి. మండల్ కమిషన్ ను కూడా గతం లో కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఎమ్మెల్సీ వెంకట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించం. వెంకట్ కవితకు క్షమాపణ చెప్పాలి. సోషల్ మీడియా ను దుర్వినియోగం చేసింది రేవంత్ రెడ్డే గతం లో మా నేతల మీద కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్య పోస్టుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ్. ముందు వాటిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ చేయాలి. ప్రెస్ మీట్ లో బమ్మెర రామమూర్తి ,అభిలాష్ రంగినేని ,సైదులు తదితరులు పాల్గొన్నారు.