Suryaa.co.in

Andhra Pradesh

నిరుపేదలకు ఆదరణ..

– పేద విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
– అమెరికా తెలుగు సంఘం సేవలు అభినందనీయం
– మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు టీం పౌండేషన్ నిరు పేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. పట్టణంలోని విష్ణుకుండినగర్ రామాలయంలో ఆదివారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆదరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తర అమెరికాలో తెలుగు సంఘం ఏర్పాటు చేయడంతో పాటు టీమ్ ఫౌండేషన్ ద్వారా పేదలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శం అన్నారు. ఫౌండేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి ఆదరణ పొందాలని కోరారు. టీం పౌండేషన్ ను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు ఐదుగురికి జీవి ఆంజనేయులు చేతుల మీదగా లాప్ టాప్ లు అందజేశారు.

13 మంది విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్లు, పేద దర్జీలు ఐదుగురికి కుట్టుమిషన్లు అందజేశారు. అలాగే పాలడుగు నీల మని అనే ఇంజనీరింగ్ విద్యార్థికి కాలేజీ ఫీజు మొత్తం 40 వేల రూపాయలను అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు సహాయం చేయగా జీవి ఆంజనేయులు చేతుల మీదగా నగదును అందజేశారు.

LEAVE A RESPONSE