Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పాల దంపతులు

అమరావతి, సెప్టెంబర్ 30: కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక- రాము దంపతులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) తో కలిసి సీఎం వైఎస్ జగన్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. జెడ్పి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించడం పట్ల ఉప్పాల దంపతులు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప్పాల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE