Suryaa.co.in

Political News

ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే విజయం నల్లేరునడకే

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి విజయదుందుభి మ్రోగించనుంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అద్భుత ప్రదర్శన ఇవ్వనుంది. యుపి, బీహార్, ఒడిషా, అస్సాం రాష్ట్రాల ఎన్నికలపై ఒక విశ్లేషణ

ఉత్తర ప్రదేశ్: 80
బీజేపీ + : 75-77 – 55% ఓట్ల శాతం
ఎస్పీ + : 3-5 – 33%
బీఎస్పీ : 0 – 8%

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గత రికార్డులను బద్దలు కొట్టి, చరిత్రాత్మక ప్రదర్శన చేయనుంది. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్ల నుంచి ఏకపక్షంగా మద్దతు లభించిన తర్వాత కూడా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి మట్టి కరిపించాల్సి వస్తుంది. బీఎస్పీ ఆవిర్భవించినప్పటి నుంచి చెత్త పనితీరును ప్రదర్శించనుంది.

బీహార్ : 40 సీట్లు
బీజేపీ + : 37-39 – 54%
ఆర్జేడీ + : 1-3 – 34%

జెడియు – ఎల్‌జేపీ రెండూ బిజెపితో ఉన్నాయి. దానికి ఉపేంద్ర కుష్వాహా మరియు జితన్ రామ్ మాంఝీల మద్దతు కూడా ఉంది, కాబట్టి అటువంటి పరిస్థితిలో బిజెపి నేతృత్వంలోని కూటమి గత ఎన్నికల మాదిరిగానే గెలుచు కోవడానికి సిద్ధంగా ఉంది.

ఒడిశా : 21 సీట్లు
బీజేపీ : 11-13 | 44% ఓట్ల శాతం
బీజేడీ : 8-10 | 42%
కాంగ్రెస్ : 0 | 10%

ఒడిశాలో బీజేపీ పుంజుకోవడం అపూర్వమైనది. ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం, సీట్ల వాటా రెండింటిలోనూ బీజేడీని అధిగమించనుంది. కాగా రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలన దిశగా కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేస్తుంది.

అస్సాం : 14 సీట్లు
బీజేపీ + : 11-12 | 48% ఓట్ల శాతం
కాంగ్రెస్ : 1-2 | 35%
ఏఐయుడిఎఫ్ : 1 | 8%

అస్సాంలో డీలిమిటేషన్ తర్వాత, బీజేపీ నేతృత్వంలోని కూటమి 2019 ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

– ఎం. హనుమ ప్రసాదు శర్మ
గుంటూరు

LEAVE A RESPONSE