Suryaa.co.in

Telangana

ఎల్కతుర్తి సభ బాహుబలి లాంటిది

-అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక అనుముల రాజ్యాంగం నడుస్తుందా?
– కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం
– కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో ఇంకొకరు లేరు
– పోలీసుల స్వయంగా టిప్పర్లు,లారీలు అడ్డం పెట్టించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు
– రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ఇది రిఫరెన్స్
– సభలో రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదని అన్నం తినకుండా పడుకున్నాడంట.
– నలుగురు మంత్రులని రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై పురిగొల్పాడు
– ఈ సభ కాంగ్రెస్ పార్టీకి కేవలం ట్రైలర్ మాత్రమే
– సీఎం,మంత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గర చంపసులేకుంటారా ?
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్: ఎల్కతుర్తి సభ రేవంత్ పాలన పై రెఫరండం లాంటిదే. ప్రజలు రేవంత్ వైపు లేరు కాంగ్రెస్ వైపే ఉన్నారని రుజువైంది. బ్రిటీష్ వాళ్లు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని వాళ్ళని పొగడతామా ? తెలంగాణ యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది .అయినంత మాత్రానా తెలంగాణ కు కాంగ్రెస్ చేసిన పాపాలు మాయమవుతాయా ? కాంగ్రెస్ తెలంగాణ కు విలన్ నెంబర్ వన్ అని కేసీఆర్ అనడం లో తప్పేమి లేదు.

మంత్రులు ఇష్టారాజ్యంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. బీ ఆర్ ఎస్ సభ సక్సస్ తర్వాత వాళ్ళు ఎం మాట్లాడుతన్నారో వారికి తెలియడం లేదు. రేవంత్ సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ను మంత్రులు మాట్లాడారు. కేసీఆర్ తన పేరు తీసుకోలేదని రేవంత్ అలిగి నిన్నరాత్రి అన్నం తినకుండానే పడుకున్నాడట.

రానున్న మూడున్నర సంవత్సరాలలో బిఆర్ఎస్ మీ భరతం పడుతుంది. మీరు కేసీఆర్ పైన విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరు గ్యారంటీలను వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పిన సీఎం,మంత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గర చంపలేకుంటారా ? ఒక్క గ్యారెంటీ అయినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా? ఉచిత బస్సు అని పెట్టి వాళ్ళు బస్సుల సంఖ్య తగ్గించారు.

అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణలో నడుస్తుంది కాబట్టి అడిగే హక్కు అందరికీ ఉంది. అడిగే హక్కు మాకు లేదంటే మీరు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక అనుముల రాజ్యాంగం నడుస్తుందా? మాజీ నక్సలైట్,రాష్ట్ర మంత్రి సీతక్క, నక్సలైట్ల హక్కుల కోసం, ధర్మం కోసం మాట్లాడిన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్పాడని
కేసిఆర్ ను సీతక్క తిట్టడం న్యాయమేనా?

తెలంగాణ రాష్ట్రాన్ని స్థిరత్వం కోల్పోయే విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు చూసి బాధతో కేసీఆర్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కుదేలైంది? పొంగులేటి సమాధానం చెప్తారా? 24 గంటల కరెంటు, సాగునీళ్లు,తాగునీళ్లు, రైతుబంధు,రైతు బీమా, ఆసరా,ఐటి, రియల్ ఎస్టేట్ అన్ని రంగాలను కేసీఆర్ అభివృద్ధి చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రులు ఎదురు దాడి చేశారు
జీఓ నంబర్ 46 ద్వారా లక్షమంది కానిస్టేబుల్స్ ను వాడుకుని చెత్తబుట్టలో పడేసారు.ఎన్నికల ముందు ఫోటో షూట్ చేశారు. ఈరోజు వాళ్లు సుప్రీంకోర్టు మెట్ల దగ్గర ఉన్నారు. అన్ని తప్పులు చేస్తున్న చిల్లర గవర్నమెంట్ ని ప్రశ్నిస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఆర్.ఆర్ టాక్స్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బిల్డర్ల కళ్ళల్లో రక్తం తిరుగుతుంది. 20 నుంచి 30 శాతం ఆర్.ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు. సుతి లేని మంత్రివర్గం. తెలంగాణ సబ్బండ వర్గాలకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా ప్రతినిధులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు.

LEAVE A RESPONSE