Suryaa.co.in

Andhra Pradesh

సభలో అర్ధవంతమైన చర్చ జరగాలి

-రాష్ట్రాభివృద్ధే అందరి ధ్యేయం కావాలి
-శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల
-శాసనసభ ఏర్పాట్లపై తొలి సంతకం చేసిన కేశవ్

“రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము” అని పయ్యావుల కేశవ్ అన్నారు.

టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు.

రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ తనం తో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు.

శాసన సభ కార్యదర్శి పిపికే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె. రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏవో కె. పద్మజ, టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జి కోనేరు సురేష్, ఆడిట్ అధికారులు, తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియ జేశారు.

LEAVE A RESPONSE