వైసీపీ దొంగల ఇసుక దాహం…రాష్ట్ర ప్రజలకు శాపం!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

ఇది రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం జంగాలపల్లె వద్ద పెన్నానదిని తోడేసి వైసిపి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డు. పెన్నానది పక్కనే ఉన్నా స్థానిక ప్రజలకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండటం లేదు. బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఇక్కడ ఇసుక తరలించి కోట్లాదిరూపాయలు దోచుకుంటున్నా ఎస్ఈబి అధికారులకు కనపడదు. జగన్ రెడ్డి పాపాలపుట్ట మాదిరి పెరిగిపోతున్న ఈ ఇసుక మేట రాష్ట్రంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్షి.

Leave a Reply