నరసరావుపేట నుండి ప్రారంభమైన తిరుపతి ఎక్స్ ప్రెస్ ట్రైన్

పల్నాడు జిల్లా (నరసరావుపేట): ఇకపై తిరుపతి వెళ్ళు ప్రయాణికులకు కొత్త మార్గంలో గుంటూరు నుంచి రైలు కూత పెట్టింది. గుంటూరు నుండి ఉన్నత అధికారులు ప్రారంభించిన రైలు నరసరావుపేట చేరింది. నరసరావుపేటలో దీనిని ఉన్నతాధికారులు జండా ఉప్పడం జరిగింది .దీంతో ఎన్నాళ్లుగానో గుంటూరు – నంద్యాల మధ్య ఇంటర్ సిటీ తరహాలో, ఒక రైలుని ప్రవేశ పెట్టాలన్న ప్రయాణీకుల ఆకాంక్ష నెరవేరినట్లు అయింది.

అంతేకాకుండా ప్రయాణికులకు సాయంత్రం వేళ నరసరావుపేట , వినుకొండ , దొనకొండ , మార్కాపురం రోడ్డు , కంభం , గిద్దలూరు తదితర ప్రాంతాలకు నూతనంగా రైలుసౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పైగా తిరుపతికి వేకువజామున 4.25 గంటలకే ఈ రైలు చేరుకోనున్నందున తిరుమల చేరుకోవడానికి ఎంతో అనువైన సమయం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది . ఈ రైలు సాయంత్రం 4.30 గంటలకు గుంటూరులో బయలు దేరి 5.15 కి నరసరావుపేట , 5.44 కి వినుకొండ , రాత్రి 9.25 కి నంద్యాల , అర్ధరాత్రి 12.43 కి కడప , మరుసటి రోజు వేకువ జామున 4.25 కి తిరుపతి చేరుకొనేలా షెడ్యూల్ రూపొందిం చింది . దీనిపై గుంతకల్లు డివిజన్ అభ్యంతరం పెట్టినా దక్షిణ మధ్య రైల్వే ససేమిరా అని ప్రకటించిన సమయపట్టిక ప్రకారమే నడపనున్నట్లు ప్రకటించింది.

తిరుగు ప్రయాణం లోనూ నిత్యం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి 9.53 కి కడప , అర్ధరాత్రి దాటాక 1.40 కి నంద్యాల , మరుసటి రోజు వేకువజామున 5.09 కి వినుకొండ , 5.44 కి నరసరా వుపేట , ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుకొంటుంది . ఈ రైలు లో ఏసీ త్రీటైర్ -1 , స్లీపర్ -2 , జనరల్ -10 , బ్రేక్ వ్యాన్ -2 ఉం టాయి . దీంతో సాధారణ రైలు ప్రయాణీకులకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుందని అధికారవర్గాలు నేడు నరసరావుపేటలో మీడియా వారికి తెలిపారు .

Leave a Reply