తెలంగాణ రాబందుల సమితిగా మారిన టీఆర్‌ఎస్‌

– ఎనిమిదేళ్ల రావుల పాలనలో ఏమీ రావు
– సికింద్రాబాద్‌ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సాయిబాబా ధ్వజం
– హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద టీడీపీ ధర్నా

తెలంగాణ రాబందుల సమితిగా మారిన టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్లపాలనలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, హైదరాబాద్‌ జిల్లా టీడీపీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై పెట్టుకున్న నమ్మకం కోల్పోయారన్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో అప్పులు, హత్యలు, కిడ్నాపులు, మహిళలపై అత్యాచారాలు తప్ప అభివృద్ధిtdphyd1 జాడ లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప, నయాపైసా అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్‌ కుటుంబపాలనతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ టీడీపీ రాజ్యం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం డిఆర్‌ఓ సూర్యలతకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లెల కిశోర్‌, యాదగిరి, రవీంద్రచారి త దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply