టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసింది

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ , మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ రావు మీడియాతో మాట్లాడిన అంశాలు

టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను మునుగోడులో నమోదు చేసింది. దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం. గతంలో ఉప ఎన్నికల్లో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదు,, కానీ ఈ ఉప ఎన్నికల్లో భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేశారు. నకిలీ ఓటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోహరించారు. గత నాలుగేళ్ల నుంచి పోలీసులు రెవెన్యూ అధికారులు ఉన్నారు వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. మంత్రులు సెక్రెటరీలని తీసుకువచ్చి అక్కడినుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అధికారులు భయపెడుతున్నారు. తప్పకుండా ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర బలగాలను ,ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కేంద్రానికి సంఘాన్ని కోరాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని తరలించారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మునుగోడు లో పెట్టారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మునుగోడులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.

Leave a Reply