Suryaa.co.in

National

ఇక బస్సు సర్వీసులోకి ఊబర్

ఢిల్లీ, కోల్‌కతాలో కూడా

ఇప్పటివరకూ కార్లు, టూ వీలర్ సర్వీసులకే పరిమితమైన ఊబర్ ఇకపై బస్సు సర్వీసులో సైతం అడుగుపెడుతోంది. ఢిల్లీ నుంచి తొలి అడుగు వేయనుంది. కోల్‌కతాలో కూడా ఊబర్ సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారట.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది. ఈ తరహా లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీ నే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలిచింది.

ఏడాదిగా ఢిల్లీ -ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతా లోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్‌ షటిల్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ దేశ్‌ పాండే చెప్పారు. ఢిల్లీ లో బస్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నట్లు గమనించామన్నారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించ బోతున్నామని తెలిపారు. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించడానికి వీలుంటుందని తెలిపింది.

LEAVE A RESPONSE