-ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం
-కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలి
-చంద్రబాబు లేఖ రాయకపోతే నేనే స్వయంగా రాస్తాను
-ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలు
-ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదు
-ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారట
-ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య అన్న ప్రచారం
-ఆమె సూసైడ్ లెటర్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు
-ఎన్టీఆర్ కుటుంబంలోకి శనిలా ప్రవేశించిన చంద్రబాబు
-ఆయన ఒక విషవలయం. ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారు
-ఎన్టీఆర్ మరణానికి కారణమై ఆ పేరునే వాడుకుంటున్నారు
-స్వార్థ రాజకీయాల కోసం హరికృష్ణను బలి చేశాడు
-పార్టీ పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు
-చంద్రబాబు వెంటనే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాలి
-బాలకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించాలి
-అప్పుడైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాయిగా ఉంటారు
-వైయస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి
తాడేపల్లి: ప్రెస్మీట్లో నందమూరి లక్ష్మీపార్వతి ఏం మాట్లాడారంటే..:
ఒక మిస్టరీలా ఉంది:
ఎన్టీఆర్ కుటుంబంలో వరసగా విషాద ఘటనలు జరుగుతున్నాయి.
హరికృష్ణ మరణమే జీర్ణించుకోలేకపోతుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఇంకా బాధ కలిగిస్తోంది. వాస్తవంగా ఏం జరుగుతోంది అనేది అర్ధం కావడం లేదు. ఒక మిస్టరీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా వినిపిస్తున్నాయి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉండొచ్చు.
అనుమానించక తప్పదు:
అయితే చంద్రబాబు మనస్తత్వం, అతడి నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరైనా కొన్ని అనుమానించక తప్పదు. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ కుటుంబంలో ఒక శనిలా ప్రవేశించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చివరికి ఇంటిపెద్దను కూడా ఆ కుటుంబం కోల్పోవడం జరిగింది.
నా భర్త మరణానికి కారకుడు:
నా భర్త ఎన్టీ రామారావు మరణానికి ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. సింహగర్జన సదస్సు నిర్వహించి, చంద్రబాబు చేసిన దగాను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నప్పుడు, అదే జరిగితే, ఎన్టీఆర్ బయటకు వస్తే, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడిన చంద్రబాబు, ఎన్టీఆర్ మరణానికి ఒక రోజు ముందు, అంటే జనవరి 17వ తేదీన ఎన్టీఆర్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోకుండా, స్టే తీసుకొచ్చాడు. దీంతో అదే రాత్రి ఎన్టీఆర్ గుండెపోటుతో చనిపోయాడు. ఆ విధంగా ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడు.
అయితే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కుటుంబం, గొర్రె కసాయివాణ్ని నమ్మినట్లుగా చంద్రబాబును నమ్ముతోంది. దీన్ని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తోంది. నన్ను బూచిగా చూపి, ఎన్టీఆర్ నుంచి పదవిని, పార్టీని లాక్కున్నాడు. దాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నమ్మారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో చాలా జరిగాయి. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం. అయన చనిపోవడానికి ముందు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
హరికృష్ణ మరణానికీ పరోక్షంగా..:
హరికృష్ణను కూడా స్వార్థం కోసం వినియోగించుకున్నాడు. ఒక మంత్రి పదవి ఇచ్చి, ఆరు నెలల్లోనే లాగేసుకున్నాడు. దీంతో హరికృష్ణ చాలా నిరాశ, విస్పృహకు లోనయ్యాడు. ఆ ఫ్రస్టేషన్లోనే కారు నడిపిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విధంగా పరోక్షంగా ఆయన మరణానికి కూడా చంద్రబాబే కారణం. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఇద్దరూ ఇప్పటికీ చంద్రబాబుతో మాట్లాడరు.
నాడు ఫోన్. నేడు లేఖ:
ఇప్పుడు ఉమా మహేశ్వరి ఆత్మహత్య కూడా ఒక మిస్టరీగా మారింది. ఆమె మంచి విద్యావంతురాలు. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకుంటే, తప్పనిసరిగా లేఖ రాసి ఉంటుంది. అయితే అక్కడికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ లేఖ మాయమైంది అంటున్నారు.
అదే విధంగా గతంలో కోడెల శివప్రసాదరావు మరణానికి కూడా చంద్రబాబే కారణం. ఆయనను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశాడు. అదే వి«షయాన్ని కోడెల స్వయంగా తన ఫోన్లో రికార్డు చేశాడు. దాంతో ఆ ఫోన్నే మాయం చేశారు. కోడెలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవ తారకం ఆస్పత్రికి తీసుకుపోయారు. దీంతో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత కూడా కోడెల భౌతిక కాయాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో రాజకీయాలు చేశాడో అందరం చూశాం.
జూనియర్ ఎన్టీఆర్:
అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసి, ఇంటికి స్వయంగా వెళ్లి, ఒప్పించి ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నాడు. ఆ తర్వాత తన కొడుకు కోసం అదే జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేశాడు. చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డాడు. చంద్రబాబుది ఎంతసేపూ అనైతిక స్వార్థ రాజకీయాలే. ఇవాళ ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేస్తున్నాడు. అసలు ఎన్టీఆర్ మరణానికి కారణమై, ఇప్పుడు ఆయన పేరునే వినియోగించుకుంటున్నాడు.
ఆమె ధైర్యవంతురాలు:
ఉమామహేశ్వరి చాలా మంచి అమ్మాయి. బాగా చదువుకుంది. 30 ఏళ్ల క్రితం నా దగ్గరకు వస్తే, నేను చీర, నగ పెట్టాను. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినప్పుడు నాతో అమెరికా నుంచి మాట్లాడింది. అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటే, అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్టీఆర్ కుటుంబంలో అంత పిరికితనం లేదు.
ఆస్తి కోసం గొడవలు. ప్రచారం:
బయటకు వచ్చిన విషయం ఏమిటంటే.. చంద్రబాబు, ఆయన కొడుకు ఒక ఆస్తి విషయంలో ఉమామహేశ్వరిని వేధిస్తున్నారని, బాగా గొడవ కూడా జరిగిందని, దాంతో ఆమె బాధ భరించలేక, ఆ విషయాలన్నీ సూసైడ్ నోట్లో రాసి, ఉరి వేసుకుని చనిపోయిందని ప్రచారం జరుగుతోంది. నేను దీన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చంద్రబాబుది అంత నీచమైన రాజకీయం. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం చంద్రబాబుది. ఆయనది దరిద్రపు అధికార వ్యామోహం. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇవి ఇన్నేళ్లుగా చూస్తున్నాం.
పచ్చి స్వార్థపరుడు:
చంద్రబాబు స్వార్థపరుడు. ఇటీవలే చూశాం. ఆయన భార్యను ఎవరూ ఏమనకున్నా సరే, కూర్చుని భోరుమని ఏడ్చి.. పెద్దసీన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చి, వారితో మాట్లాడించాడు. గతంలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు, అప్పుడు డాక్టర్గారి భుజంపై చేయి వేసి మాట్లాడాడు.
అండగా ఉంటారనుకుంటే..:
చంద్రబాబుకు నిజంగా పెద్ద మనసు ఉంటే, ఆ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే, పరిష్కరించలేవా? ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. మీరు అండగా ఉంటారనుకుంది. కానీ నీవు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. కాబట్టి, ఆమె ఆత్మహత్యలో నీకూ భాగం ఉంది. మరో విషయం. ఆ అమ్మాయి సూసైడ్ నోట్ను మాయం చేశావు. దాన్ని ఎక్కడో దాచిపెట్టావు. దీనిపై కూడా చాలా ప్రచారం జరుగుతోంది.
ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు:
కాబట్టి, ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని వదిలిపెట్టు. ఇంకా ఎన్నాళ్లూ నీవు, నీ కొడుకు ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతుకుతారు. నందమూరి కుటుంబాన్ని వదిలిపెట్టు. వారంతట వారు బతుకుతారు. పార్టీని అడ్డు పెట్టుకుని నీవు, నీ కొడుకు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ పార్టీ ద్వారా ఏమీ సంపాదించుకోలేదు. తన పిల్లలకు కూడా ఏమీ ఇవ్వలేదు. కానీ నీవు లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీవు, నీ కొడుకు, మనవడు తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించావు.
అందుకే నీకు ఏ మాత్రమైనా ఇప్పుడు మనసు అనేది ఉంటే, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు. బాలకృష్ణకు విడిచిపెట్టు. బాలకృష్ణ ఒట్టి అమాయకుడు. ఆయనపై వైస్రాయ్ హోటల్లో ఒత్తిడి చేసి, ఎంతో విద్యాధికురాలు, అందగత్తె అయిన ఆయన కూతురిని నీ కొడుక్కు ఇచ్చే విధంగా ఒప్పించావు. నీ కొడుకు ఒక పనికిమాలిన వెధవ. పెళ్లి తర్వాత ఆమెను ఎంతో వేధించావు. అంత దౌర్భాగ్యం నీ చరిత్ర.
సీబీఐ దర్యాప్తు. లేఖ రాయాలి:
ఉమా మహేశ్వరి ఆత్మహత్య విషయంలో నీకు ఏ సంబంధం లేకపోతే, నీవు నిర్దోషివి అయితే, దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీవే స్వయంగా లేఖ రాయి. ఆ దర్యాప్తులో నీ నిర్దోషిత్వం లేదని తేలితే, అప్పుడు నిన్ను నమ్ముతాం. ఆ కుటుంబానికి అండగా ఉండి, బాధ్యతగా వ్యవహరించాల్సిన నీవు.. అందుకు విరుద్ధంగా, నీవు, నీ కొడుకు ఉమామహేశ్వరితో గొడవ పడ్డారని తెలిసింది. కాబట్టి నీవు వెంటనే సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాయాలి. ఒకవేళ నీవు లేఖ రాయకపోతే, నేనే స్వయంగా రాస్తాను. నిజానికి ఆరోజు ఎన్టీఆర్ మరణంపై సీబీఐ దర్యాప్తు కోసం నేను ఎంతో పోరాడాను. ఇప్పుడు కూడా నీ కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నది అని నమ్ముతున్నాం కాబట్టి, సీబీఐ దర్యాప్తు కోరాలి.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అధికార వ్యామోహం. కుళ్లుబుద్ధి:
చంద్రబాబు అసలు మనిషి కాదు. ప్రతిదీ రాజకీయమే. అధికార వ్యామోహం. కుళ్లు బుద్ధి. కోడెల శివప్రసాద్ చనిపోయిన తర్వాత శవాన్ని అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో రాజకీయం చేశాడో. అసలు కోడెల ఫోన్ ఎక్కడికి పోయింది?
ఎన్టీఆర్ను మోసం చేసి, పార్టీని, పదవిని లాక్కుని ఆయన మరణానికి కారణమై, ఆయన చనిపోగానే ఫోటో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నావు. చివరకు రూ.2 కోట్లు ఖర్చు చేసి, పార్టీ గుర్తు పొందావు. అంత నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇవాళ కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని లాభం పొందాలని చూస్తున్నాడు.
జగన్పై నిందలు:
చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో రూ.1.60 లక్షల కోట్లకు లెక్కలు లేవని స్వయంగా కేంద్రమే చెప్పింది. పదవి దిగిపోతూ, కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ, పేదలు, ప్రజల కోసం చిన్న వయసులో కూడా జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.
మీకు ఆ హక్కు లేదు:
అసలు లోకేష్కు జగన్ని విమర్శించే నైతిక హక్కు ఏముంది? లోకేష్ మంత్రిగా ఉండి, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అందుకే చంద్రబాబుకు, ఆయన కొడుక్కు.. జగన్గారిని విమర్శించే నైతిక హక్కు ఏ మాత్రం లేదు.లోకేష్ జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి అట. ఎక్కడుంది ఆ పార్టీ. గుర్తింపు కోల్పోయే పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ముందుంది.
రాబోయే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదు. ఎంతసేపూ, తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వంపైనా, జగన్పైనా విరుచుకు పడడం తప్ప, చంద్రబాబు చేస్తున్నదేమిటి?
అదే జగన్ స్వయంకృషితో ఎదిగారు. ఎక్కడా ఆయన కుటుంబానికి, చంద్రబాబు కుటుంబానికి పోలిక లేదు.చంద్రబాబు ఒక విష వలయం. ఆయన కాటుకు ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు బలవుతున్నారు. అందుకు చంద్రబాబు త్వరలోనే ఫలితం అనుభవిస్తాడు.