Suryaa.co.in

Andhra Pradesh

తెదేపాలోకి విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉండవల్లిలోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

దేవినేని అవినాష్ వైసీపీ లోకి వచ్చిన తరువాత అతనిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

నేడు లోకేష్ ని కలిసిన వారిలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్, పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE