ఆర్టీసీ డ్రైవర్‌పై గ్రామస్తుల దాడి

నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం పెరమకొండలో ఆర్టీసీ డ్రైవర్‌పై గ్రామస్తులు దాడి చేశారు. 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చావుకి డ్రైవర్ కారణమయ్యాడు. ఈ క్రమంలో అదే రూట్లో వస్తున్న డ్రైవర్‌ను గమనించిన గ్రామస్తులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. దాడిలో డ్రైవర్ గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు.

Leave a Reply