– ప్రతీ వ్యక్తికి 6 కిలోల రేషన్ సన్నబియ్యం
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: కొత్త రేషన్ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ప్రస్తుతం 90లక్షల కార్డులు, 2 కోట్ల 80 వేల మంది ఉన్నారు. బి ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో 40వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు.
కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40 లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని మా అంచనా. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6 కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యం పంపిణీ వల్ల 11వేల భారం ప్రభుత్వం పై పడుతుంది. ప్రజా పాలన, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు పరిశీలన చేస్తున్నాం. లిస్ట్ లో పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలి. హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు బి ఆర్ ఎస్ మోసం చేసింది. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు.