Suryaa.co.in

Telangana

పదేళ్లలో మెదక్‌ గడ్డకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏం చేసింది?

-ఉరికించి కొడతా బిడ్డా…నోరు జాగ్రత్త
-పిట్టలదొర పని అయిపోయింది…ఇక కారు తుక్కుకే…

-ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లడిగే దమ్ముందా..
-ప్రజాపాలన ఓర్వలేక కడుపు మంట
-దుబ్బాకలో గెలిచి నిధులు తెచ్చావా రఘునందన్‌?
-నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో వచ్చి చూపించు
-దుర్గమ్మ సాక్షిగా రుణమాఫీ, రూ.500 బోనస్‌ ఇస్తా
-రైతుల భూములు గుంజిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి
-మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్‌
-నీలం మధును గెలిపించాలని పిలుపు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్‌ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారు..1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్‌ పార్లమెంట్‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉంది.. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతానికి చేసిందేం లేదు.. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో మెదక్‌ ప్రజలకు ఒరిగిందేం లేదు..దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్‌రావును అడుగుతున్నా…మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం.. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించు? పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారు.. కేసీఆర్‌ సీఎంగా ఉన్నారు. వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలని హితవుపలికారు. కేసీఆర్‌ పని అయిపోయింది..ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందే.. కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్‌ అంటుండు…అదేమైనా నువు తాగే ఫుల్‌ బాటిలా అయిపోవడానికి అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఇక్కడున్నది రేవంత్‌రెడ్డి.. బిడ్డా టచ్‌ చేసి చూడు..
చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని కాదు. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన మాది. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం..రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. మేం ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే కడుపు మండిన మోదీ, కేసీఆర్‌ కాం గ్రెస్‌ను ఓడిరచేందుకు కుట్ర చేస్తు న్నారు. మేం పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంటే చూసి ఓర్వలేక పోతున్నారు.

దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా…
తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంటకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది.

పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్‌, హరీష్‌ హామీలు నెరవేర్చలేదు. కానీ, వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం ఖాయం. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత మాది. మల్లన్న సాగర్‌, రంగనాయక్‌ సాగర్‌ రైతుల భూములు గుంజు కున్న దుర్మార్గుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ధ్వజమెత్తారు. మోదీ, కేడీ తొడుదొంగలు.. డిసెంబరులో కేడీని ఇంటికి పంపించాం.. ఇక ఇప్పుడు మోదీని ఇంటికి పంపించాలని పిలుపుని చ్చారు. పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే..బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాల్సిన బాధ్యత మీదేనని అభ్యర్థించారు.

LEAVE A RESPONSE