డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో డిజీపీ మౌనాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు

లిక్కర్ మాఫియా వెనుక కవిత ఉంటే డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో డిజీపీ మౌనాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు భంగం కలిగించేలా సన్ బర్న్ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వొద్దని సునీతా రావు డిజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ లో సన్ బర్న్ కార్యక్రమాలను ప్రారంభిస్తే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుందని డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని దీంతో చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అత్యాచారాలకు, దాడులకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ కమిషనర్ను కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాలకు లిక్కర్ ను సరఫరా చేయొద్దని కోరామని తెలిపారు. గోవా, కర్ణాటక రాష్ట్రాలు బ్యాన్ చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం స్వాగతించడాన్ని బట్టి చూస్తే రెవిన్యూ కోసం ఎంతటికైనా దిగజారుతుందని అర్థమవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు.

Leave a Reply