Suryaa.co.in

Telangana

రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయరు?

-పంటల బీమాను అమలు చేయాల్సిందే
-కౌలు రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగా ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 లక్షల సాయం అందించాలని కోరారు. ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్‌ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన బండి సంజయ్‌ బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వారి బాధలను విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అకాల వానలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. గతంలో కురిసిన వర్షాలతో నా నియోజకవర్గంలో చాలాచోట్ల రైతులు పంట నష్టపోయారు. ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, పొతుగల్‌, గంభీరావుపేట ప్రాంతాల రైతులు చాలా నష్టపోయారు. నాకు తెలిసి ప్రస్తుతం ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిరది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు.

అధికారంలోకి రాకముందు ఒక మాట. వచ్చిన తరువాత మరో మాట రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించి ఎకరాకు రూ.10 వేల సాయం వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ పైసా సాయం చేయలేదు. కేంద్రం ఫసల్‌ బీమా పథకం ప్రవేశపెడితే అమలు చేయకుండా అంతకంటే గొప్ప పథకం అమలు చేస్తానని పదేళ్లుగా మాటలు చెప్పిండే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. ఏ ఒక్క రైతుకు కూడా నయాపైసా సాయం చేసిన దాఖలాల్లేవు. కోపంతో రైతులు పంటలను తగలబెట్టుకున్నారు. ఇదే జిల్లాలో వడ్ల కుప్పలపై చనిపోయారు. అప్పు తెచ్చి పంట పెట్టుబడి పెడుతుఆన్నారు. సాగు చేసి తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట నష్టపోతున్నారు. చివరకు తెచ్చిన అప్పును తీర్చేందుకే మళ్లీ సాగు చేస్తున్నారు.. ఇంకా బాధాకరమేందంటే సాగు చేసుకుందామంటే సమయానికి నీళ్లివ్యరు. నీళ్లుంటే కరెంటు ఉండదు. కరెంట్‌ ఉంటే పంట చేతికొచ్చే సమాయానికి అకాల వర్షాలతో పంట మునిగిపోతుంది. పోనీ చేతికి పంట వచ్చినా తేమ పేరుతో వడ్ల కొనుగోళ్లలో రైతులను అన్యాయం చేస్తారు. మద్దతు ధర ఇవ్యరు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు తక్షణ సాయం అందించాలి. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున సాయమందించాలి. కౌలు రైతులకు సైతం సాయం అందించాల్సిందే. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఎన్నికల పేరుతో ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని సాయం అందించాల్సిందే. నాకు తెలిసి ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం చెప్పదు. ఈ విషయంలో తమ పార్టీ రైతుల కోసం పూర్తిగా సహకరిస్తాం అన్నారు.

LEAVE A RESPONSE