Suryaa.co.in

Telangana

ఏ సంక్షేమ పథకాన్ని ఆపి అందాల పోటీలు పెడుతున్నారు?

– ఉద్యోగులను సీఎం రాక్షసులు గా చిత్రీకరిస్తారా ?
– సీఎం రేవంత్ ది శాడిజం
– కార్ల స్థానం లో అందరికీ హెలికాఫ్టర్లు కొనివ్వండి
– సోనియా రాహుల్ పై ఈడీ కేసు పెడితే మంత్రులు ధర్నా చేయొచ్చా ?
– దమ్ముంటే ఉద్యోగులు అడుగుతున్న 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఉద్యోగుల జే ఏ సీ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్

హైదరాబాద్: ఉద్యోగుల విషయం లో కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలుకు వేచి చూశాo. సమయం దాటి పోతోంది. 2 శాతమే ఉన్నారని ఉద్యోగులను అవమానిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా చూశాo. 73 శాతం ఫిట్ మెంట్ ఇప్పించాం. హోం గార్డుల జీతాలు భారీగా పెంచేలా కృషి చేశాం.

హెల్త్ కార్డులు ఇప్పించాం. ఈ ప్రభుత్వం లో రిటైర్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక గుండె ఆగి చనిపోతున్నారు. వంద రోజుల్లో పి ఆర్ సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. డీ ఏ లు వెంటనే విడుదల చేస్తామని ఇప్పటివరకు చేయలేదు. ఉద్యోగులను ఎవ్వరూ రెచ్చగొట్టడం లేదు. మంత్రుల కమిటీ ఉండగా అధికారుల కమిటీ ఎందుకు ? మంత్రులను అవమానపరిచినట్టే. సీఎం బెదిరింపు ధోరణి సరి కాదు.

ఉద్యోగులు రావాల్సిన డీ ఏ లు బెనిఫిట్స్ కోసం పోరాడుతున్నారు. ఉద్యోగులు పెట్టిన 54 డిమాండ్లలో 36 డబ్బులతో సంబంధం లేనివే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత మా రక్తం మరుగుతోంది. ఉద్యోగులను సీఎం రాక్షసులు గా చిత్రీకరిస్తారా ?

కోసుకు తిన్నా ..అని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడతారా ? రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ రాకుంటే ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? సీఎం కూడా ఉద్యోగే ..ఆయన కూడా జీతం తీసుంటున్నారు.

పాకిస్థాన్ లోని తీవ్రవాద శిబిరాలపై భారత సైనిక దళాలు విజయవంతంగా చేసిన దాడులను స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. సీఎం ది దుర్మార్గ వైఖరి. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి. ఉద్యోగుల పై ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.

ఉద్యోగులు ప్రజలు వేర్వేరు కాదు. ఉద్యోగులు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నందుకే రేవంత్ కు అక్కసు. సీఎం రేవంత్ ది శాడిజం తప్ప మరొకటి కాదు. పెన్షనర్లు కోర్టు కు పోతేనే డబ్బులు ఇస్తారా? ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారా ? ఉద్యోగులను దోచుకుని దాచుకునే వారిగా సీఎం చిత్రీకరిస్తున్నారు. సీఎం రేవంత్ ముక్కు సూటిగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడటం సరికాదు.

రేవంత్ ఇవే ముక్కు సూటి మాటలు ఎన్నికల్లో మాట్లాడితే ప్రజలు ఎవరికీ ఓటెయ్యాలో నిర్ణయించుకునే వారు. ఎన్నికలప్పుడు ఓ మాట ఇపుడు మరో మాటా ? అధికారులతో కమిటీ కాలయాపన కోసమే. ప్రభుత్వానికి భారం కాకుండా సిఫారసులు చేయాలంటే కమిటీ ఏం పని చేస్తుంది ? కార్ల కంటే హెలీకాఫ్టర్లకు తక్కువ ఖర్చు అవుతుందని శ్రీధర్ బాబు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. హెలికాఫ్టర్లు అంత చౌక అయితే కార్ల స్థానం లో అందరికీ హెలికాఫ్టర్లు కొనివ్వండి.

ఉద్యోగులు సమ్మెకు పిలుపు నివ్వలేదు ..ధర్నా చేస్తామంటేనే సీఎం కు ఎందుకు ఆంత కోపం ? సోనియా రాహుల్ పై ఈడీ కేసు పెడితే మంత్రులు ధర్నా చేయొచ్చా ? కచ్చితంగా ఉద్యోగుల డిమాండ్లకు బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుంది. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యోగులకు మద్దతు ఇస్తే తప్పేమిటీ ?

కే టీ ఆర్ కే ఉద్యోగుల సమస్యల పై మాట్లాడే హక్కు ఉంది. కే టీ ఆర్ ను కాంగ్రెస్ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనం. ఉద్యోగుల ఇపుడు అనేక ప్రయోజనాలు పొందుతున్నారంటే కేసీఆర్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలే కారణం. కేసీఆర్ ను మరిపిస్తా అంటున్న రేవంత్, దమ్ముంటే ఉద్యోగులు అడుగుతున్న 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి.

గతం లో ఇచ్చిన కమిటీ రిపోర్టులు ఏమయ్యాయి? కొత్త కమిటీ ఎందుకు ? ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా కేసీఆర్ తో పాటు బీ ఆర్ ఎస్ సభ్యులు అండగా ఉంటారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు మాతో కలిసి వచ్చేవారితో ఉద్యమిస్తాం. ప్రెస్ మీట్ లో సుమిత్ర ఆనంద్ ,విష్ణువర్ధన్ రావు ,కళ్యాణ్ కుమార్ ,భుజంగ రావు ,హమీద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE