Suryaa.co.in

Andhra Pradesh

రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసీపీ సభ్యులు గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి,ఉప కార్యదర్శి వనితా రాణి,అభ్యర్థులు తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి,మేడా మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE