– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని
విజయవాడ: విభజన చట్టంలోని హామీలను 90% నెరవేర్చాం. ఈ బడ్జెట్ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలుచేసేలా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలకు వికసిత భారత్ ఫలాలు అందేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు
వైసిపి నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయి. వైసిపి పాలనలో కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకున్నారు.గత ఐదేళ్లల్లో అద్భుతమైన పాలన అన్న వారు.. ఇప్పుడు తప్పు పడుతున్నారు. మహిళలు, రైతులు, శ్రామికుల కు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారు.
12.75 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారు. మహిళలకు 4లక్షలకోట్లు ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించారు. విభజన చట్టం లోని పోలవరం మొదటి దశకు గతంలో 18280 కోట్లకు పైగా నిధులిచ్చాం ఇప్పుడు మిగిలిన 12157 కోట్లను కేటాయించాం.
పోలవరం లో పి అనే పదం పలకడం చేతకాని వైసిపి నేతలు బడ్జెట్ గురించి నీతులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన 4853 కోట్లతో పాటు ఇటీవల 15000 కోట్లు, హడ్కో నుండి 11000 కోట్ల నిధులు కేటాయించాం. అమరావతి భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారు.మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారు. విశాఖ ఉక్కు కోసం గతంలో గతంలో 11440 కోట్లు ఇప్పుడు 3295 కోట్లు ఇచ్చాం.
విభజన చట్టంలోని జాతీయ విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేశాం . తిరుపతి IIT కి 1348 కోట్లు, తాడేపల్లిగూడెం లోని NIT కి 730 కోట్లు, కర్నూల్ లోని IIITDM కి 297 కోట్లు, విశాఖలోని IIM కి 472 కోట్లు, తిరుపతిలోని IISER కి 1492 కోట్లు, అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీకి 450 కోట్లు, విజయనగరంలోని గిరిజన యూనివర్సిటీకి 834 కోట్లను, మంగళగిరిలోని ఎయిమ్స్ కి 1820 కోట్లు ఇచ్చాం.
విభజన చట్టంలోని విశాఖ రైల్వే జోన్ కోసం 107 కోట్లను, తిరుపతి విశాఖపట్నం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి వేల కోట్లను విడుదల చేశాం.
ప్రధాన ఎయిర్ పోర్ట్ లను అంతర్జాతీయ స్థాయిలొ అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ పోర్టుకు 730 కోట్లు, వివిధ ప్రాజెక్టులకు మరో 1200 కోట్లు బడ్జెట్ లో కేటాయించాం.ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది.గత ప్రభుత్వం లో అనేక కేంద్ర ప్రాజెక్టు లకు స్థలాలు కూడా ఇవ్వలేదు.
ఇచ్చిన నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లించుకున్నారు. కూటమి పాలనలో ఇలాంటి ఎన్నో ప్రాజెక్టు లు మళ్లీ పట్టాలెక్కాయి. గత ఐదేళ్లల్లో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది. అందుకే ప్రజలు 11సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చో పెట్టారు. అర్ధరాత్రి తలుపులు మూసి విభజన చేసిన కాంగ్రెస్ కు మమ్మలను విమర్శించే అర్హత లేదు.
పిల్ల కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తుంది. మోడీ ఆధ్వర్యంలో అనేక రైల్వే ప్రాజెక్టు లు, జాతీయ రహదారుల నిర్మాణం మన రాష్ట్రం లో జరిగింది.గత వైసిపి ప్రభుత్వం లో పారిశ్రామిక వేత్తలు ఎపికి రావాలంటే భయపడ్డారు. ఉన్న పరిశ్రమలు కూడా మూయించి పంపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక మంది పారిశ్రామిక వేత్త లు ఏపి వైపు చూస్తున్నారు.కేంద్రం కూడా విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక వాడల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల సాయం అందిస్తోంది. మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేస్తుంటే…తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లు మా పై బురద జల్లుతున్నాయి. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే… వైసిపి కి ఈసారిఆ 11 సీట్లు కూడా రావు. ఆత్మ, పరమాత్మ అనుకున్న వాళ్లు కూడా వైసిపి ని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లారు..ఇంకా అనేక మంది కూటమి పార్టీ ల వైపు చూస్తున్నారు. భవిష్యత్తు లో వైసీపీ పూర్తి గా కనుమరుగవడం ఖాయం