వైకాపా రాబందులు మరోసారి రాజధానిపై పడ్డారు

– టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ

రాజధాని ప్రాంతాన్ని, చంద్రబాబు చేసిన నిర్మాణాలను గ్రాఫిక్స్, ఎడారి, ముంపుప్రాంతం అంటూ అవహేళన చేసి వైసీపీ నేతలు మాట్లాడారు. రాజధాని ప్రాంతం భూములను అమ్ముకోవాలని వైసీపీ ప్రయత్నించింది. చంద్రబాబు హయాంలో నిర్మించిన భవంతుల్లే వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుకుంటోంది. అంటే వైసీపీ పరిపాలన కూడా గ్రాఫిక్స్ లోనే జరుగుతోందని ప్రజలు అనుకోవాలా?

హైకోర్టు 6నెలల్లో రాజధానిని నిర్మించాలని చెబితే దాన్ని కూడా గౌరవించలేదు. వైసీపీ పాలనలో రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై వైసీపీ కి ఎందుకంత కక్ష?వారికి రోజుకో సమస్యను సృష్టించి, వాళ్లను మానసిక వేదనకు గురిచేస్తూ వేధిస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన దళిత రైతులను కొట్టి, రోడ్డుమీద పడేసి ఈడ్చి, చేతులకు బేడీలు వేసి అరెస్టు చేయించారు…

రైతులంటే వైసీపీ కి ఎందుకంత కడుపుమంట? రాజధానికి భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. వాళ్లు న్యాయం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్రను కూడా వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు. మూడు రాజధానులపై దండయాత్ర అంటూ అమరావతి రైతుల పాదయాత్రను చులకన చేసి మాట్లాడడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వాళ్ల పాదయాత్రకు మేం సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం…

అమరావతిలో రాజధానిని పూర్తిచేయడమే టీడీపీ ప్రథమ కర్తవ్యం.అమరావతిలో రాజధాని ఉంటేనే ఉమ్మడి 13జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజధానికి భూములిచ్చిన రైతులకు నెలవారీ పెన్షన్లు, కౌలు సకాలంలో అందించి సాయపడాలి. మూడు రాజధానుల డ్రామాకు వైసీపీ ఇప్పటికైనా తెరదించాలి.అమరావతి రైతుల త్యాగాలు మీ కళ్లకు కనిపించడం లేదా జగన్ రెడ్డి?
రైతులను వేధించే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలి. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఆపడం ఎవరివల్ల కాదు.దాన్ని అణచాలని చూస్తే, రెట్టింపు వేగంతో ఉద్యమం ఊపందుకుంటుందని వైసీపీ నేతలు గ్రహించాలి.

Leave a Reply