Suryaa.co.in

Andhra Pradesh

మహిళల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వైకాపా

– పార్టీ మహిళా విభాగ సమావేశంలో అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి

జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లి లో గురువారం నాడు జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు.

LEAVE A RESPONSE