టిడిపి గెలిచిన స్థానాల్లో ఫలితాలను తారుమారు చేస్తారా?

– జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం
– వైసిపి వత్తిళ్లకు తలొగ్గిన అధికారులకు ఇబ్బందులు తప్పవు
– తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరిక
రాష్ట్రంలో జరుగుతున్న జడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ లో కూడా వైసిపి ప్రభుత్వ అరాచకాలకు హద్దుపద్దూ లేకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హీర మండలం జడ్పిటిసి స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు…ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ పై 59 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. టిడిపి అభ్యర్థి గెలిచినట్లు అధికారిక ప్రకటన చేసిన తర్వాత వైసిపి నాయకుల వత్తిడితో రీకౌంటింగ్ కు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్దం. దీనిని పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియలో అధికారులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోంది. అధికారులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తే న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడకతప్పదని హెచ్చరిస్తున్నాం.
అనంతపురం జిల్లా జూటూరు ఎంపిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి నాగేశ్వరరెడ్డి కౌంటింగ్ లో తొలుత 4 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు, వైసిపి అభ్యర్థులు రీకౌంటింగ్ చేయించినప్పటికీ 4 ఓట్ల మెజారిటీ ఉంది, అయినా నిబంధనలను పక్కనబెట్టి మూడోసారి కౌంటింగ్ నిర్వహించి ఒకఓటుతో వైసిపి అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా? పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ రెండుచోట్ల ప్రజాస్యామ్యబద్ధంగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అధికారికంగా విజేతలుగా ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విజ్జప్తి చేస్తున్నాం.

Leave a Reply