– సొంత అన్నయ్యపై అంత దారుణ విమర్శలా?
– అత్యంత హేయంగా ఏమిటా పదజాలం?
– జగన్ని రాజకీయంగా పతనం చేయాలనుకుంటున్నారా?
– ఆయన్ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు?
– చంద్రబాబు డైరెక్షన్లో మీరు పని చేస్తున్నారు
– వైయస్సార్ కూతురుగా ఇన్నాళ్లూ గౌరవించాం
– అందుకే రాజకీయంగా శతృవుగా భావిస్తున్నాం
– ఒంగోలులో వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు
ఒంగోలు: వైయస్సార్ ఇద్దరు పిల్లల్లో ఒకరు, తండ్రి ఆశయాల కోసం నిరంతరం పోరాడుతున్నారని, కృషి చేస్తున్నారని.. ఆయనే జగన్ కాగా, అదే వైయస్సార్గారికి బద్ధశతృవు అయిన వారితోనూ, ఆ పార్టీ అనుకూల మీడియాతోనూ జతకట్టి, చివరకు వైయస్సార్గారి పేరును చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పని చేస్తోంది. ఆయన కూతురు షర్మిల అని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తెలిపారు.
జగన్కి నిజంగా పదవి, డబ్బుపై వ్యామోహం ఉంటే, ఆనాడు కాంగ్రెస్ను ఎదిరించి ఉండేవారు కాదని, సోనియా చెప్పినట్లు వినేవారని, రోశయ్య తర్వాత తప్పనిసరిగా సీఎం అయి ఉండేవారని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో వారసులు ఉన్నారంటూ.. కోట్ల, నాదెండ్ల వారసుల పేర్లు ప్రస్తావించిన ఆయన.. నమ్మిన సిద్దాంతానికి, ఆశయాలకు కట్టుబడి పోరాడుతున్న, అన్యాయంగా 16 నెలలు జైల్లో ఉన్న జగన్గారిని, ఆయన సోదరి రోజూ చంపుతున్నారని, ఇందుకు ఆమె మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు.
ఆనాడే వైయస్సార్ వారసురాలిగా చనిపోయారు. జగన్ని అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న రోజే, షర్మిల వైయస్సార్గారి వారసురాలిగా చనిపోయారు. వాస్తవాలు చెప్పిన సొంత చిన్నాన్నను కూడా తప్పు పడుతున్నావు. ఎందుకింతగా దిగజారిపోయావు? ఆయన జగన్గారి మోచేతి నీళ్లు తాగుతున్నారా? ఏమిటా పిచ్చి విమర్శలు? రాజకీయంగా మిమ్మల్ని బద్ద శతృవులుగానే భావిస్తున్నాం.
నీవు నీతిమాలిన, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నావు. అక్కడ తెలంగాణ సీఎంతో కలిసి పని చేస్తావు. ఇక్కడ టీడీపీతో కలిసి పని చేస్తున్నావు. అక్కడి నుంచి నీకు నెల నెలా నిధులు ఇస్తున్నారు. చివరకు నీ ఫ్లైట్ కూడా వారే ఏర్పాటు చేస్తున్నారు. జగన్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊర్కోబోము. తొక్కుకుంటూ పోతాం. మీరు ఆరోజు పాదయాత్ర చేశారు. మరి దాన్ని ఎవరు సక్సెస్ చేశారు. అది మేమే చేశాం. మీ అన్నయ్య జైలులో ఉంటే, ఆయనకు మద్దతుగా మా పార్టీ కార్యకర్తలంతా రోడ్డెక్కారు. దాని వల్లనే నీ పాదయాత్ర సక్సెస్ అయింది.
వైయస్సార్ చనిపోయే నాటికి మీ ఆస్తుల విలువ ఎంత? ఆ తర్వాత ఎంత? అన్నీ లెక్కలున్నాయి. సాక్షి ప్రారంభించిన కొత్తలో చాలా నష్టాలు. నెలకు ఖర్చు సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.33 కోట్లు. రాబడిపోను ప్రతి నెలా సగటున రూ.20 కోట్ల నష్టం వచ్చేది. మరి ఆ నష్టంలో పాలు పంచుకుంటానని ఎప్పుడైనా షర్మిల వచ్చారా? ఆమె అన్నకు తన సొంత ఆస్తుల ద్వారా ఏమైనా సాయం చేశారా? జగన్ ప్రారంభించిన సంస్థలు.. వైయస్సార్ పోయే నాటికి దాదాపు రూ.1300 కోట్ల రుణభారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేసులు వచ్చాయి.
జగన్గారు మీకేం చేయలేదా?
జగన్ తనకేమి చేశారని షర్మిల అన్నారు. ఏమీ చేయలేదా? రూ.200 కోట్లు ఎవరు తీసుకున్నారు? అవి మీ అన్న ఇచ్చినవి కాదా? మీకు మీ తండ్రి ఇచ్చింది కన్నా.. మీ అన్న ఇచ్చింది ఎక్కువా? తక్కువా? షర్మిల చెప్పాలి. రాశేఖరెడ్డి లేని తర్వాత.. ఆ కుటుంబ భారాన్ని మోసింది జగన్ కదా? మరి ఏమీ చేయలేదని ఒక్క మాటతో కొట్టేస్తే ఎలా? ఇవాళ మీరు అనుభవిస్తున్నదంతా ఆయన ఇచ్చిందే కదా? కంపెనీల్లో నీ పేరు ఎక్కడైనా ఉందా? ఆరోజు దాన్ని మీరు మీ తండ్రిని ఎందుకు అడగలేదు? భారతి సిమెంట్స్ అని పేరు ఎందుకు పెట్టారంటే, అది ఆయన సొంతం కాబట్టి.
నీకు జగన్ 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో జగన్ తన కంపెనీల్లో 40 శాతం వాటా రాసిచ్చినప్పుడు, నీ పేరు మీద ఎందుకు మార్చుకోలేదు? కారణం అలా చేస్తే నీవు రూ.200 కోట్ల రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత కేంద్రం రూల్ మార్చింది.
దాంతో నీవు షేర్లు మార్చుకున్నావు. కొత్త డ్రామా ఆడుతున్నావు.
జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, ఆస్తులు ఆయనవే అనడం సరికాదని మరో అబద్ధం చెప్తున్నారు. భారతిపై కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతిఆస్తులు అటాచ్ అయ్యాయి. ఆమె పేరు కూడా కేసులో ఉంది.
ఇంకా తల్లిని కోర్టుకు ఈడ్చారు అంటున్నారు. ఈ పరిస్థితికి కారణం షర్మిల కాదా? మోసపూరితంగా షేర్లు బదిలీ చేసుకోవడం వల్లనే కదా ఇదంతా? షేర్ సర్టిఫికెట్స్ పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చి బదిలీ చేయించుకున్నారు. దీన్ని వెనకుండి నడిపింది ఎవరు?.
కాబట్టి అందరి కోసమైనా.. ఇప్పుడు షర్మిలని కట్టడి చేయాలని విజయమ్మ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నానని టీజేఆర్ సుధాకర్బాబు వెల్లడించారు.