ఆంధ్రప్రదేశ్ భవన్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకను ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ ఆర్ సీ) ఆదిత్యనాధ్ దాస్,రెసిడెంట్ కమీషనర్ సౌరబ్ గౌరవ్ మరియు అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ (ఏ.ఆర్.సీ) హిమాన్షు కౌశిక్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీ.ఆర్.సీ,ఆర్ సి,అండ్ ఏ.ఆర్.సీ లు జ్యోతి ప్రజ్వలన గావించి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు, సిబ్బంది, అతిథులు మరియు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.