Suryaa.co.in

Telangana

హైదరాబాద్ లో 208 మంది పాకిస్థాన్ జాతీయులు

– 27వ తేదీలోపు వారు ఈ ప్రాంతం నుంచి నిష్క్రమించాలి
– నగరంలో ఉన్న పాకిస్థాన్ జాతీయుల వీసాలన్నీ రద్దు
– 27వ తేదీ నుంచి పాకిస్థాన్ వీసాలు పనిచేయవు
– తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరిక

హైదరాబాద్: నగరంలో 208 మంది పాకిస్థాన్ జాతీయులు నివసిస్తున్నారని, ఈ నెల 27వ తేదీలోపు వారు ఈ ప్రాంతం నుంచి నిష్క్రమించాలని తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు నగరంలోని పాకిస్థాన్ జాతీయులకు డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

నగరంలో ఉన్న పాకిస్థాన్ జాతీయుల వీసాలన్నీ రద్దు అయ్యాయని, అటారీ సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంటుందని వెల్లడించారు. 30వ తేదీ తర్వాత దేశంలో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ నెల 27వ తేదీ నుంచి పాకిస్థాన్ వీసాలు పనిచేయవని హెచ్చరించారు. వైద్య వీసా కలిగిన వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉందని, దీర్ఘకాలిక వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని డీజీపీ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE