Suryaa.co.in

Andhra Pradesh

ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ముగ్గురు వైసీపీ ఎంపీలు

ఢిల్లీ: ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ కార్యాల‌యంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా ర‌ఘునాథ్‌రెడ్డిలతో ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ ప్ర‌మాణం చేయించారు. రాజ్యసభలో ప్ర‌స్తుతం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రమాణస్వీకారానికి ముందు మీడియాతో గొల్ల బాబూరావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభలో దళితులకు అవకాశం కల్పించారని అన్నారు. సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట వేశారని కొనియాడారు. పేదల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

LEAVE A RESPONSE