Suryaa.co.in

Andhra Pradesh

ఐదుగురు ఎంఎల్సిల ప్రమాణ స్వీకారం

అమరావతి:ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు,బిటి నాయుడు,కొణిదల నాగేంద్ర రావు(నాగబాబు) పేరాబత్తుల రాజశేఖర్,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లచే బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ చాంబరులో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు సభ్యులచే శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కె.అచ్చన్నాయుడు,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్,ఉప కార్యదర్శి రాజ్ కుమార్,ఇతర అధికారులు, పలువురు ఎంఎల్ఏలు,ఎంఎల్సిలు,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE