Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

– మచిలీపట్నం మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ

లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో వైసిపి నాయకులు యువగళంపై అవాకులు చవాకులు పేలారు.వాళ్లకు దీటుగా సమాధానం చెబుతూ పాదయాత్ర జనసంద్రమై గన్నవరం వరకు వచ్చింది.పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించింది, అక్రమ కేసులు పెట్టింది.

వైసీపీ కుట్రలను ఛేదిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్న లోకేష్ కు అభినందనలు.9నెలలు రాష్ట్ర ప్రజల్లో తిరిగి, ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్ మనువడు లోకేష్.కృష్ణాజిల్లా ప్రజలు యువగళం పాదయాత్రలో నభూతో నభవిష్యత్ అనేలా పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అవినీతిమయమైంది.పరిశ్రమలు, అభివృద్ధి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అనేలా జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.లోకేష్ పాదయాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజా స్పందనే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది.

LEAVE A RESPONSE