Suryaa.co.in

Andhra Pradesh

ఉపాధ్యాయులు దైవ స్వరూపులు

సీఎం చంద్రబాబునాయుడు

విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము.

పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని దైవస్వరూపులుగా భావిస్తుంటాం. ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే వారికి మనం సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. ఉపాధ్యాయులను గౌరవించుకోవడమంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమే. అందుకే గురుపూజా దినోత్సవం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా గురువులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు.

LEAVE A RESPONSE