Suryaa.co.in

Telangana

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు

– వారానికి రెండు పర్యాయాలు
– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ నుంచి గోవాకు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) స్పెషల్ ట్రైన్‌ వేసింది. వారంలో రెండుసార్లు ఉండే ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే అటు వాస్కోడగామా నుంచి ఉదయం తొమ్మిది గంటలకు రైలు బయలుదేరుతుంది.

బుధ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇక, వాస్కోడగామా (గోవా)-సికింద్రాబాద్ రైలు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది.

LEAVE A RESPONSE