Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి రక్త దాహానికి ఇంకెంతమంది బలికావాలి?

– తిరుపతి జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యను ఖండిస్తున్నాం
– చట్టప్రకారం నిందితులను కఠినంగా శిక్షిస్తాం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు యాదవ్

అమరావతి: తిరుపతి జిల్లా, చిల్లకూరు మండలం, నాంచారంపేటలో టీడీపీ నేత హరిప్రసాద్ దారుణహత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో జీర్ణించుకోలేని వైసీపీ రౌడీ మూకలు తెలుగుదేశం క్యాడర్ పై దాడులు, హత్యలకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామంలోని పొలం విషయంలో టీడీపీ వర్గీయులతో గొడవ పడి కక్ష గట్టి ఈ హత్య చేశారు. హరి ప్రసాద్ ఇంట్లో నిద్రపోతుండగా వైసీపీ నేత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాడికి తెగబడ్డారు.

హరి ప్రసాద్ పై పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న వారిపైన రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచారు. టీడీపీకి చెందిన కాటయ్య ఇంటిపైనా వైసీపీకి చెందిన మధు, అతని అనుచరులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డినే వైసీపీ క్యాడర్ ఆదర్శంగా తీసుకుంటోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు అండగా నిలబడతాం. వైసీపీ రౌడీల దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

LEAVE A RESPONSE