ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి పెద్దవాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తున్నావా అంటూ తన ఆక్రోశాన్ని, అసూయని వెళ్లగక్కాడు. వాస్తవానికి లింకన్ తానున్న ఉన్నతమైన స్థితిలో అలాంటి మాటలు అన్న వ్యక్తిని వెంటనే పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించవచ్చు. కానీ లింకన్ అలా చేయలేదు. వెంటనే అతనికి సెల్యూట్ చేసి ఇంత మంది పెద్దల సభలో తన తండ్రిని గుర్తు చేస్తున్నందుకు నేను మీకు రుణపడి ఉంటాను. ఈ సభలో మీ బూట్లే కాదు ఎంతో మంది బూట్లను నా తండ్రి కుట్టి ఉండవచ్చు. నా తండ్రి వృత్తినే దైవంగా భావించాడు. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ నా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటె చెప్పండి. నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పాడు. వాటిని మీ ఇంటికి వచ్చి నేను సరి చేస్తాను ఎందుకంటే నా తండ్రికి అప్రతిష్ట రావటం నాకిష్టం లేదని చెప్పి ఆనందభాష్పాలతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అంతే అవమానపరుద్దామని అనుకున్న ఆ ఐశ్వర్యవంతుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనం మనకు సరైన మార్గం చూపిస్తుంది.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…