ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి పెద్దవాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తున్నావా అంటూ తన ఆక్రోశాన్ని, అసూయని వెళ్లగక్కాడు. వాస్తవానికి లింకన్ తానున్న ఉన్నతమైన స్థితిలో అలాంటి మాటలు అన్న వ్యక్తిని వెంటనే పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించవచ్చు. కానీ లింకన్ అలా చేయలేదు. వెంటనే అతనికి సెల్యూట్ చేసి ఇంత మంది పెద్దల సభలో తన తండ్రిని గుర్తు చేస్తున్నందుకు నేను మీకు రుణపడి ఉంటాను. ఈ సభలో మీ బూట్లే కాదు ఎంతో మంది బూట్లను నా తండ్రి కుట్టి ఉండవచ్చు. నా తండ్రి వృత్తినే దైవంగా భావించాడు. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ నా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటె చెప్పండి. నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పాడు. వాటిని మీ ఇంటికి వచ్చి నేను సరి చేస్తాను ఎందుకంటే నా తండ్రికి అప్రతిష్ట రావటం నాకిష్టం లేదని చెప్పి ఆనందభాష్పాలతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అంతే అవమానపరుద్దామని అనుకున్న ఆ ఐశ్వర్యవంతుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనం మనకు సరైన మార్గం చూపిస్తుంది.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…