ప్రశాంతంగా తరగతులు నిర్వహణ

– 81కి పెరిగిన విద్యార్థుల హాజరు
– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి

సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరుగుతుందని, ప్రశాంతంగా తరగతులు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కూడా పాఠశాలలకు ఆసక్తిగా హాజరవుతున్నారని తొలిరోజు 61 శాతం హాజరు కాగా గురువారం నాటికి 81 శాతంకు విద్యార్థుల హాజరు నమోదైనదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం 85 శాతం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 84 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరువుతున్నారన్నారు.

పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సురేష్ తెలిపారు.

Leave a Reply