స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర

– ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు బలపడుతున్నాయి.ఇందుకు తగ్గట్లుగానే తితిదే చర్యలు ఉన్నాయి. ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాల కల్పనమీద లేదా? మళ్లీ దర్శనం ఆలోచన కుటుంబాలకు రాకుండా వ్యవహరిస్తున్నారు.ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో తితిదే సమాధానం చెప్పాలి.స్వామివారి సేవ, భక్తుల సేవ కాకుండా ఎవరి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు పడే ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఏడాది పాటు ప్లాన్ చేసుకుని వస్తే కొండమీదకు వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలా?వేసవిలో కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేసే తీరిక కూడా మీకు లేదా?

Leave a Reply