Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా ఆమోదయోగ్యంగా కూటమి మేనిఫెస్టో

-కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు
-పరిశ్రమలు, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ లను అభివృద్ధి చేస్తాం
-యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
-రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించి మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తాం
-సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్ లోకి రాష్ట్ర గ్రోత్ ను తీసుకెళ్తాం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల

కూటమి మేనిఫెస్టో ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టోపై వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మెచ్చుకున్నాయి. ఈ మేనిఫెస్టోతో ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.

బుధవారం నాడు ఆయన మీడియా( జూమ్ మీటింగ్) సమావేశంలో మాట్లాడుతూ….జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని వినాశనం చేసింది. వినాశనం నుండి ఉన్నతి స్థితికి తీసుకువెళ్లడానికి ప్రజా మేనిఫెస్టోను రూపొందించాం. ఈ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోను ఎలా అమలు చేస్తారన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నివృత్తి చేయడం కూటమి బాధ్యత.

ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ను ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి చాలా ఆదాయం చేకూరుతుంది. ఉన్న వనరులను వినియోగించుకుని ప్రైవేట్ పరం అవుతున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. దీంట్లో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మైన్స్ ను దుర్వినియోగం చేశారు. మద్యంలో అక్రమాలకు పాల్పడ్డారు. పక్కదారి పడుతున్న సొమ్ములను ప్రభుత్వానికి మళ్లీస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

డీబీటీ ఇస్తున్నామని చెబుతూ వైసీపీ ప్రభుత్వం అనవసర ఖర్చులను పెట్టింది. ఉదా: అక్కరలేని అడ్వైజర్లు ఎంతోమంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి వేస్ట్ ఖర్చులను తగ్గించి ఇలాంటి అడ్వైజర్లను తొలగిస్తాం. రెవెన్యూ రేసియో చాలా తక్కువగా ఉంది. జగన్ రెడ్డి, జే గ్యాంగ్ దోపిడీతో ట్యాక్స్ రెవెన్యూ అంతా తగ్గిపోయింది. దాన్ని దారిలోకి తీసుకు వస్తాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెద్దగాలేదు.

ట్యాక్స్ జీఎస్డీపీ రేసియోలో ఏపీ ప్రభుత్వం చాలా లో లెవల్ లో ఉంది. కూటమి అధికారంలోకి రాగానే ట్యాక్స్ లు పెంచకుండా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సేషన్ లో ఎవరైనా ట్యాక్స్ కట్టకుంటే వారికి నోటిసు ఇచ్చినప్పుడు 50% లేదా 80% కట్టి కోర్టుకు వెళతారు. ఆ విధానం ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లేదు. దాన్ని కూడా తీసుకువాల్సి ఉంది. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది.

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో మనకు 14 ఫైనాన్స్ కమిషన్ 2% పెంచితే 15 ఫైనాన్స్ కమిషన్ లో గత సంవత్సరం 41% ఉన్న స్టేట్ కు ఇచ్చే రెవెన్యూను 40% కి తగ్గించారు. 1% శాతం తగ్గటంతో రాష్ట్రానికి రూ. 1500 కోట్లు కేంద్ర నిధుల్లో కోత పడింది. నేడు కేంద్రం మనకు సపోర్టు చేస్తుంది. 16 ఫైనాన్స్ కమిషన్ తో చర్చించి ఇప్పుడు స్టేట్ కు రావాల్సిన గ్రాంట్ ను 50 శాతం పెంచేలా కృషి చేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

టీడీపీ ప్రభుత్వంలో ఎకనామిక్ గ్రోత్ రేట్ డబుల్ డిజిట్ లో ఉంటే.. వైసీపీ దాన్ని సింగిల్ డిజిట్ కు తెచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ డబుల్ డిజిట్ కు జీఎస్డీపీని తీసుకు వస్తాం. అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం యావరేజ్ గా 12 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అందులో మళ్లీ జీతాలు కూడా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి దూరం అయ్యింది. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయారు. అభివృద్ధి ఉంటే అక్కడ ఆదాయం సృష్టి జరుగుతుంది. దాంతో రాష్ట్రంలో ఆదాయం పెరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

టీడీపీ మేని ఫెస్టోతో బలహీన వార్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అధిక ధరలు నియంత్రణలోకి వస్తాయి. అనవసరమైన ఖర్చులు అదుపులోకి వస్తాయి. చిరు వ్యాపారులకు, మహిళకు మేలు జరుగుతుంది. పనుల కల్పనతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రూరల్ ఎకానమి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకం. వైసీపీ పాలనలో ఆగ్రో ఇండస్ట్రీలు అన్ని దెబ్బతిన్నాయి. కోఆపరేటివ్ సిస్టమ్ ను డవలప్ చేయాల్సి ఉంది. ఆగ్రోప్రొసెస్ ఇండస్ట్రీస్, హార్టీకల్చర్, ఆక్వాకల్చర్, లైవ్ స్టాక్ లు అన్నీ కూడా రాష్ట్ర గ్రోత్ ను పెంచేవి. ఇప్పుడు ఇవి అన్ని కూడా పడిపోయాయి. వీటిని గాడిలో పెడితే రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది. సంపద పెరిగే విధంగా అన్ని సెక్టార్ లపై దృష్టి పెడతాం.

ఈ ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్ నెగిటీవ్ గ్రోత్ లోకి పడిపోయింది. ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. జగన్ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాలేదు. దాన్ని మళ్లీ సెట్ రైట్ చేయాలి కొత్త పరిశ్రమలను తీసుకు రావాలి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఆదాయం పెరుగుతుంది. పేదల ఆదాయం పెరుగుతుంది. పేదలు, యువతను దృష్టిలో పెట్టుకుని కూటమి మేనిఫెస్టోను రూపొందించాం.

100శాతం హామీలను అమలు చేయగలిగే మేని ఫెస్టో ఇది. ఎటువంటి సందేహాలు అక్కరలేదు. వైసీపీ పాలనలో విద్యావస్థ సర్వ నాశనం అయ్యింది. వైసీపీ పాలనలో పేదలకు ఆరోగ్యం అందని పరిస్థితి నెలకొంది. పేదల ఆరోగ్య రక్షణకు కూటమి కట్టుబడి ఉంది. ఓవరాల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువస్తాం. ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ లను ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం.

ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సెక్టార్ లు భాగుపడితే… ఆటోమెటిక్ గా సర్వీస్ సెక్టార్ బాగుపడుతుంది. సర్వీస్ సెక్టార్ ను వైసీపీ నాశనం చేసింది. టూరిజం, ఐటీలను పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఆదాయం పెంచాలన్న ఆలోచన చేయలేదు. వాళ్ల సొంత ఆదాయం పెంచుకోవడంపైనే శ్రద్ధపెట్టారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి మేనిఫెస్టోను తయారు చేశారు. కూటమి మేనిఫెస్టోతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని యనమల పేర్కొన్నారు.

LEAVE A RESPONSE