75 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా లో నారావారిపల్లె అనే మారుమూల కుగ్రామమంలో.. ఖర్జూర నాయుడు అమ్మణమ్మ అనే రైతు దంపతులకు ప్రధమ పుత్రుడుగా ఒక బాలుడు జన్మించాడు.
ఆ బాలుడు భవిష్యత్ లో …విశ్వ విద్యాలయాన్ని శాసించగలిగే విద్యార్థి నాయకుడిగా, ఆ తదుపరి అతి పిన్న వయస్సులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో.. మొదట్లో శాసన సభ్యుడు, ఆ వెంటనే ఒక మంత్రిగా స్థానం సాధించి ప్రజాసేవలో ఆరంగ్రేటం చేస్తారని గాని … విశ్వ విఖ్యాత నవరస నట సార్వభౌమ, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కీర్తింపబడిన పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు కి అల్లుడు అవుతారని గానీ ..ఆ తదుపరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుదీర్ఘ కాలం సేవలంచిందే ముఖ్యమంత్రి అవుతారని గానీ నాడు ఆ తల్లి తండ్రులు బహుశా భావించి ఉండకపోవచ్చు.
ఆ బాలుడే నేటి కోట్లాది ప్రజల అభిమాన పాత్రుడు, ఒక కోటి నలభై లక్షల మందికి పైగా ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ఆరాధ్య దైవం, నేటి విభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఒక రాజకీయ నాయకుడు ఎలా తన జీవనాన్ని గడపాలి అలాగే ఒక పాలకుడు ప్రజా పాలన ఎలా చెయ్యాలి అనే దానికి ఈ దేశంలో బహుశా గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మించి మరొకరు లేరేమో అంటే అతిశయోక్తి కాదు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు, సాక్షాత్తు స్వంత మామ ఒక రాజకీయ పార్టీ పెట్టడంతో తెలుగుదేశంలో చేరి పెద్దాయనకు తోడునీడగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్న క్రమంలో.. అనుకోని విపత్తు తో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని రక్షించే బాధ్యత తీసుకొని ..నాటి నుండి నేటి వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు దేశం పార్టీని, అనేక ఆటు పోట్ల మధ్య విజయవంతంగా నడిపించిన తీరు అసాధారణం. అనితర సాధ్యం.
తన పాలనలో చంద్రబాబు నాయుడు సాధించిన విజయాల పట్టిక వ్రాయాలంటే.. మాహా భారత గ్రంధాన్ని మించిపోతుందేమో అనిపిస్తుంది.
ఒక ఇరవై ,పాతికేళ్ల క్రితం సగటు విద్యార్థి ఆలోచన విధానం ..చిన్నదైనా పెద్దదైన ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదా ఒక బ్యాంకు ఉద్యోగం లాంటివి పొందాలని కలలు కనేవారు..
అలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో రాబోవు చున్న విప్లవాత్మక మార్పులను తన అపార మేధస్సుతో ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు ..ఆ దిశగా అడుగులు వేసి, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ సాఫ్ట్ వేర్ కేంద్రాలలో ఒకటిగా చేసి, లక్షలాది మందికి ఉపాధి తో పాటు హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం లో కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు హయాంలో హైదరాబాద్ నగరం ఒక ప్రపంచ స్థాయి మహానగరంగా రూపుదిద్దుకుంది అంటే సమంజసం.
చంద్రబాబు ఒక ప్రాంతీయ పార్టీ అధినేత అయినప్పటికీ అయన పాలనా దక్షత ..నాయకత్వ లక్షణాలు ..చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు ..తద్వారా లభించిన ఆయన కీర్తి ప్రతిష్టలు దేశంలోని మిగతా రాష్ట్రాలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.
తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి క్షణాన్ని ప్రజా క్షేమం. రాష్ట్ర అభివృద్ధి మీద ఆలోచన తప్ప అధికారాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు కనిపించవు. సమకాలీన రాజకీయ నాయకులలో బహుశా చంద్రబాబు నాయుడు లాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారు బహుశా లేరేమో. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితం లో ఆయన పై ప్రత్యర్ధులు, అనేక నిరాధార ఆరోపణలు చేశారు. అలాగే అయన పేరు ఉచ్చరించే స్థాయి లేని వారు కూడా ఆయనను చులకనగా, అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నవి.
ఇలాంటి అనేక సందర్భాలలో అయన మౌనంగా భరించారే తప్పితే, ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోయి నోరు జారిన సందర్భాలు లేవు. ఇది అత్యంత అరుదైన వ్యక్తిత్వం.సాధారణ రాజకీయ నాయకులకు ఇది సాధ్యం కాదు.విభజిత ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకొన్నప్పుడు …ఆంధ్రప్రదేశ్ దుస్థితి అత్యంత విషాదకరం. బండెడు అప్పులు ..రాజధాని లేదు. సరిపడ ఆదాయ వనరులు లేవు. ఎక్కడనుంచి ప్రారంభించాలో తెలియని దుస్థితి.
అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నెలల తరబడి బస్సులో నిద్రించి.. తన అపార మేధస్సుతో పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాల భూమిని ప్రజలనుండి సేకరించి, అత్యద్భుత రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనేక అవరోధాల మధ్య అతి స్వల్ప కాలంలోనే సచివాలయం హైకోర్టు అనేక ఇతర భవనాలు, అంతర్గత రహదారులు నిర్మించి రికార్డు సృష్టించారు.
ఐదేళ్ల పాటు రోజుకు దాదాపు 18 నుండి 20 గంటలు శ్రమించి, అనాధగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను సరిపడా ఆదాయవనరులు సృష్టించి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. అంత కష్టపడి పనిచేసిన వ్యక్తిని ( కారణాలు ఏవైనా కావచ్చు ) ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించినప్పుడు కూడా, ప్రజా తీర్పును శిరసావహించారే తప్ప ప్రజలను తప్పుపట్టలేదు.
అలాగే ఆయన అరెస్ట్ కాబడిన సందర్భం లో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఉవ్వెత్తున లేచిన ప్రజాభిమానం ..ప్రజా ఉద్యమం ..చరిత్రలో మరి ఏ ఇతర రాజకీయ నాయకుడికి దక్కని అరుదైన గౌరవం అనడంలో సందేహం లేదు. నేడు భారత దేశపు రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒక కోటి 40 లక్షల మంది పార్టీ సభ్యులతో అత్యంత బలంగా గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నది.
ఒక రకంగా చెప్పాలంటే నేడు మూడు వందలకు పైగా గుర్తింపు కలిగిన ప్రపంచ దేశాలలో, దాదాపు 40 శాతం దేశాల కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ అంటే ఆశ్చర్యం కలగక మానదు. క్రమశిక్షణ విషయం లో తెలుగు దేశం కార్యకర్తలు అధినేత మాట జవదాటరు. ఇది చంద్రబాబు అతి పెద్ద విజయం.
నేటి రాజకీయ నాయకులలో చిన్న చిన్న పదవులలో.. కేవలం కొంత కాలం ఉన్న వారి మీదనే పుంఖాను పుంఖాలుగా అనేక ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో, నలభై ఏళ్లకు పైగా రాజకీయాలలో ఉండి .. నాలుగు సార్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవి లో ఉన్నప్పటికీ కూడా, నాటి నుండి నేటి వరకు చిన్న అవినీతి మరక కూడా లేని మహా నాయకుడు చంద్రబాబు.
ఆయన తన మూడు పదుల వయస్సులో ఎలా పని చేశారో అంతే ఉత్సాహంతో 75 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా పని చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాదు.
చంద్రబాబు కి ఉన్న మేధస్సు ..కస్టపడి పనిచేసే తత్వం ..భవిష్యత్ ను ఖచ్చితంగా వేయగల నేర్పరి తనం ..ఆయన అసాధారణ విజయాలకు కారణమయ్యాయి.ఆయన రాజకీయాలలో కాకుండా ఒక పూర్తి స్థాయి పారిశ్రామిక వేత్తగా ఉండి ఉంటే ఈ దేశం మరో టాటా ను మరో అంబానీని చూసి ఉండేది.
ఆయనను కుల,మత ,ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అలాగే ఆయనను పార్టీలకతీతంగా అందరూ నాయకులూ గౌరవిస్తారు. అధికారులు అందరూ చంద్రబాబు లాంటి విలువలు కలి
న నాయకుడి దగ్గర పని చెయ్యడానికి అమితంగా ఇష్టపడతారు.
ఇలాంటి సుగుణాలు .. వ్యక్తిత్వం ఉన్న రాజకీయ ఆణిముత్యం.. మన తెలుగు రాష్ట్రము లో తెలుగు వారిగా జన్మించి, వారి పాలనలో మనము ఉండడం మన అదృష్టం గా భావిస్తూ ..వారికి తన 75 వ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా తన జీవితం గడపాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ ..
– డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య
చంద్రబాబు నాయుడు అభిమాని