– ఆయనకు ఫోన్ చేసిన సీఎం రేవంత్రెడ్డి
– హైకోర్టులో వాదనలపై నేతలతో సీఎం సుదీర్ఘ మంతనాలు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆ మేరకు తన పట్టుదల నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలతో, పార్టీ సీనియర్లతో సీఎం రేవంత్రెడ్డి రాత్రి వరకూ సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టులో వినిపించాల్సిన వాదనలు, దానికి సంబంధించిన అంశాలపై సీఎం పార్టీ నేతల సలహాలు, సూచనలు తీసుకున్నారు.
సమావేశంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో.. బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తర్వాత సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని ఆయనను కోరారు.