– పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి
– గ్రూప్ 1 పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం
– ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం
– గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆందోళన
– గన్ పార్క్ లో నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా
– ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు, గ్రూప్ 1 అభ్యర్థులు
హైదరాబాద్: గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా కార్యక్రమం నిర్వహించాము..గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి TGPSC ముట్టడి చేసిన ప్రభుత్వంలో చలనంలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు .
రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చెయ్యలేదు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం.
గ్రూప్ 1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం.
తెలంగాణ లో ఉన్నటువంటి మేధావులు మౌనం వీడాలి. గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ సార్ మాట్లాడాలి. అవసరం అయితే నేను హరగోపాల్ సార్ ను కలుస్తాను. రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాము.
తక్షణమే గ్రూప్ నియామకాలు రద్దు చేసి, తిరిగి మళ్లీ గ్రూప్ 1 పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం.