– వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో శస్త్ర చికిత్సలు
– వైద్యులకు సూపరింటెండెంట్ అభినందన
సిరిసిల్ల: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో వైద్యులు మరో సారి 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు ద్వారా 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2 , ఆర్థో ఆపరేషన్ ఒకటి ఉన్నాయి.
ఆపరేషన్లు చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, సోనీ, మాధవి ,పిల్లల వైద్యులు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్,మత్తు వైద్యులు రాజశ్రీ, తిరుపతి, రవీందర్,కంటి వైద్యులు డాక్టర్ రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి,అనసూయ, బ్లోసమ్ తో పాటు ఇందులో పాల్గొన్న ఇతర సిబ్బంది ని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ పెంచలయ్య అభినందించారు. పేద ప్రజలకు రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అంకిత భావంతో అందించాలని తెలియజేశారు.