సీబీఐటి జాబ్‌మేళాలో దాదాపు 4500 మంది ఎంపిక

-3347 మంది ఎంపిక కాగా, షార్ట్‌లిస్ట్‌లో 1234 మంది
-ఇది చాలా గొప్ప విషయం. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియ
-ఇది సీఎం వైయస్‌ జగన్‌ స్థిర సంకల్పం… లక్ష్యం
-వైయస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి

సీబీఐటీ. చాపాడు: ప్రెస్‌మీట్‌లో వి.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
అది ఎప్పటికీ మర్చిపోలేనిది:
జాబ్‌మేళా అనేది గౌరవ ముఖ్యమంత్రిగారి ఆలోచన. ఉద్యోగాలు లేక బాధ పడుతున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం చూడాలన్నది సీఎం లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికైన వారు, తమ జీవితంలో విద్యాభ్యాసం తర్వాత, రెండో దశకు వెళ్తున్నారు. కాబట్టి మీరంతా మిమ్మల్ని ఎంపిక చేసుకున్న కంపెనీలకు కృతజ్ఞత చూపాలి. అంకిత భావంతో పని చేయాలి. మీకు ఉద్యోగం వస్తే, మీ తల్లిదండ్రుల ముఖాల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. అది ఎప్పటికీ మర్చిపోలేనిది.

ఉన్నత స్థాయికి చేరాలి:
మీరు ఉద్యోగానికి ఎంపిక కావడంతోనే నిల్చిపోకూడదు. మీ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాలి. బాగా పని చేసి, ఉన్నత స్థానానికి చేరుకోవాలి. మీ ప్రతిభ చూపితే ఇంకా గొప్ప అవకాశాలు వస్తాయి.
కాబట్టి మీరు కష్టపడి పని చేయాలి.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌:
వైయస్సార్‌ జిల్లాలో ఇవాళ్టి జాబ్‌మేళాకు 8364 మంది హాజరైతే దాదాపు 4500 మంది ఎంపిక కావడం చాలా గొప్ప విషయం. మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఒకటి గమనించాం. మీరు 100 శాతం విజయం సాధించాలంటే, మీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడు బాగా లేదని అనడం లేదు. అయితే మీరు చెప్పాలనుకునేది ఇంకా విశ్వాసంతో చెప్పాలి. అప్పుడే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వారికి మీపై నమ్మకం ఏర్పడుతుంది.

అదే లక్ష్యం. అందుకే..:
జాబ్‌మేళా అనేది నిరంతం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. నిరుద్యోగ సమస్యను పారదోలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రం నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలి. ప్రపంచంలో మన వాళ్లు ఎక్కడ పని చేసినా, తమను తాము ప్రూవ్‌ చేసుకోవాలి. ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలి. వాటిలో సక్సెస్‌ కావాలి.

జాబ్‌ రాని వారు నిరుత్సాహపడొద్దు: వైయస్‌ అవినాష్‌రెడ్డి. ఎంపీ.
ఇవాళ సీబీఐటీలో జాబ్‌మేళాకు మొత్తం 8364 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 3347 మంది ఎంపికయ్యారు. ఇంకా 1234 మంది షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. వారికి మరో రౌండ్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. వారిలో కూడా చాలా మంది ఎంపికయ్యే వీలుంది. ఇవాళ ఎంపికైన వారిలో 434 మందికి ఇప్పుడు ఆఫర్‌ లెటర్లు ఇస్తున్నాం. మిగిలిన వారందరికీ వారం రోజుల్లో ఈమెయిల్‌ ద్వారా ఆఫర్‌ లెటర్లు పంపిస్తాం.
ఇవాళ ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన వారు నిరుత్సాహçపడొద్దు. మీకు కూడా ఉద్యోగాలు వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం.
ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విశాఖలో మెగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తే 350 కంపెనీలు పాల్గొన్నాయి. 40,243 ఉద్యోగాలు ఇచ్చాం. మూడు దశల్లో నిర్వహించిన జాబ్‌ మేళా ఇప్పుడు ముఖ్యమంత్రిగారి సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో నాలుగో దశలో మెగా జాబ్‌మేళా నిర్వహించాం. ఇందులో 120 కంపెనీలు పాల్గొనగా, ఉద్యోగాలు కల్పించాం.
మంచి సంకల్పంలో నిర్వహించబోతున్నాం. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం.. ఈ మూడు కూడా సమాంతంరంగా అభివృద్ధి చెందాలి. ఆ దిశలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో వాళ్ల ఆలోచనలు వేరేరకంగా వెళ్లకుండా ఉద్యోగంపై దృష్టి పెట్టి రాష్ట్రంతో పాటు కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడతారు. ఉద్యోగ అవకాశాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయం.

ఉన్న ఉద్యోగాలు తీసేసిన చరిత్ర బాబుది
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మేము నిర్వహిస్తున్న జాబ్‌ మేళాను విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంతో కంపేర్‌ చేసుకుంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంచుమించు 60 ప్రభుత్వ రంగ సంస్థలును మూసేశారు. ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా… తీసేసిన ప్రభుత్వం చంద్రబాబుది. అదే ఈ మూడేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వాలంటీర్‌ వ్యవస్థలో మొత్తం 4లక్షల 50వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కల్పించారు. ఇవి కాకుండా వైద్యరంగంలో 30వేలు ఉద్యోగాలు కల్పించారు. రాబోయే కాలంలో పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వౌలో విలీనం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇంచుమించు 5లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వానికి దక్కుతుంది. దానికి విరుద్ధంగా చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, ఉద్యోగాలను కల్పించడంపోయి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.. తన హయాంలో ఒక్క జాబ్‌ మేళా అయినా నిర్వహించాడా అని తనను తాను ప్రశ్నించుకుంటే మా ప్రభుత్వాన్ని విమర్శించడు. ఉద్యోగాలు కల్పిస్తున్న వైయస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబును అభినవ పులకేశిగా అభివర్ణించాలి. అలాంటి వ్యక్తిని నమ్మవద్దని సూచిస్తున్నాం. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి, విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ జాబ్‌ మేళా ప్రక్రియ కొనసాగుతుంది.

కరోనా సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా వాటిని కొనసాగిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదు. వాస్తవంగా ఇది ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం. అలాగే ఏపీపీఎస్సీలో ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రాబోయే రెండేళ్లలో కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక కడప జిల్లాలో పలు భారీ, మధ్యతరగతి పరిశ్రమలు వచ్చాయి, మరెన్నో పరిశ్రమలను ఇక్కడకు తీసుకువస్తున్నారు, ఎన్ని రాబోతున్నాయేది ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు చెప్పనవసరం లేదు. 50శాతం మహిళా సాధికారిత అనేది ముఖ్యమంత్రిగారి అభిమతం. గతంలో నిర్వహించిన జాబ్‌ మేళాల్లో 40 వేల ఉద్యోగాల్లో అధికంగా మహిళలు, మహిళా విద్యార్థినులు మాత్రమే ఎన్నిక కాబడ్డారు. సోషల్‌ జస్టిస్‌ విషయానికి వస్తే… ముఖ్యమంత్రి చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి స్థానానికి ఒక ఎస్టీ మహిళను దేశ అధ్యక్షురాలుగా ఎన్నిక చేయడాన్ని ముఖ్యమంత్రి సమర్థించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు అభివృద్ధి చెందేలా పథకాలు రూపొందిస్తున్నాం.

ఈమధ్యకాలంలో నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. అతడు చదవిన చదువు ఏంటి? నిజంగానే చదివాడా? అయిదేళ్లు మంత్రిగా పనిచేసి, మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్హుడా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. యుద్ధ వీరులో, యుద్ధం చేసి గెలిచినవాళ్లో సవాల్‌ చేస్తే బాగుంటుంది. పప్పు తిని పడుకునే వ్యక్తి సవాల్‌ చేయడం సరికాదు. ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారంతా ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవాళ్లు మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోనివాళ్లు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూ జరిగినప్పుడు అధైర్యపడకుండా వాళ్లకు తెలిసింది చెబితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ఎంపిక కాలేదో వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. రెండేళ్లలో నిరుద్యోగ సమస్య అనేదే రాష్ట్రంలో లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ముఖ్యమంత్రి ఆశయాన్ని తప్పకుండా సాధించి తీరతాం.

Leave a Reply