Suryaa.co.in

Andhra Pradesh

అచ్చెన్నాయుడు తల్లి మృతి

నిమ్మాడ : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా అచ్చెన్నాయుడికి విషయం తెలియడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లారు.

కళావతమ్మ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE