ఏపీ ఎంఎస్ఎండిసీ చైర్మన్ గా ఆడారి ఆనంద్

ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీ ఎంఎస్ఎం డిసీ) చైర్మన్ గా ఆడారి ఆనంద్ ను నియామకం చేస్తూ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డెయిరీ చైర్మన్ గా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త గా వ్యవహరిస్తున్న ఆనంద్ కు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.

తనపై ఉన్న విశ్వాసంతో ఏపీ ఎంఎస్ఎం డీసీ చైర్మన్ గా నియామకం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకులు వై వి సుబ్బారెడ్డికి, విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, గుడివాడ అమర్నాథ్ కు ఆడారి ఆనంద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply