ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చండి: సుప్రీం కోర్టు

దిల్లీ: కస్టోడియల్‌ టార్చర్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెండున్నరేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిందని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన తర్వాతే సీబీఐ విచారణపై పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Leave a Reply