కౌలు రైతు భరోసా యాత్రకు ఎన్.ఆర్.ఐ. జనసేన బృందం విరాళం

– పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి రూ. 25 లక్షల చెక్ అందించిన ఎన్.ఆర్.ఐ ప్రతినిధులు

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం రూ. 25 లక్షలు విరాళం అందించింది. ఈ మొత్తాన్ని ఎన్.ఆర్.ఐ. బృందం ప్రతినిధులు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బుధవారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో మీరుpk అందించిన ఈ సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ డబ్బు రైతు కుటుంబాలకు చేరేలా, వారి పిల్లలు చదువులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మీరిచ్చిన సలహాలు నా దృష్టిలో ఉన్నాయి. మీ ఆహ్వానం మేరకు త్వరలోనే సరైన సమయంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తాన”ని చెప్పారు ఈ బృందంలో పప్పుల జ్ఞానేశ్వర రావు,  వఝుల పవన్ కిశోర్,  గాజుల మురహరి,పులిపాటి రామ్, సింగంశెట్టి పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply