ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ద్వారా రూ.41,338 కోట్ల కేటాయింపులు

-కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా ఏపీకి రావలసిన నిధులు రూ.19, 794 కోట్లు
-శాసనమండలిలో ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అమరావతి, మార్చి, 24: బడ్జెట్ లో భాగంగా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల నిధులు రానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన ప్రకారం , స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్ల నిధులను కేంద్రం కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం నుంచి వివిధ ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాల కింద ఏపీకి రూ.19, 794 కోట్ల నిధులు రానున్నాన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు కేంద్రం కేటాయించిందని మంత్రి బుగ్గన తెలిపారు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి రూ.40 కోట్లు కేటాయించగా..విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.168 కోట్ల నిధులు ఏపీకి కేంద్రం ద్వారా వస్తాయన్నారు. గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి రూ.23.20 కోట్లు..అనంతపురం ప్రశాంతి నిలయానికి రూ.12 లక్షలు నిధులు కేంద్రం ఏపీకి కేటాయించినట్లు మంత్రి బుగ్గన వివరించారు.

Leave a Reply