Suryaa.co.in

Andhra Pradesh

కర్రలు, రాడ్లతో అంబటి రాంబాబు అల్లుడి దౌర్జన్యం

-పోలింగ్‌ బూత్‌ దగ్గర టీడీపీ శ్రేణులపై బూతులు
-నా కొడుకులను తన్ని తరిమేయాలని పోలీసులకు హుకుం
-తరిమికొట్టిన టీడీపీ శ్రేణులు..ఊరి నుంచి పరార్‌

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ చౌదరి ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో సోమవారం పోలింగ్‌ సందర్భంగా హల్‌చల్‌ చేశాడు. పోలింగ్‌ బూత్‌ దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయాడు. నా కొడకల్లారా ఎవర్రా మీరు? ఇక్కడ మీ ఫోజులు ఏంటి అంటూ దౌర్జన్యం చేయబోయాడు. పోలీసు లను పిలిచి ఈ నా కొడుకులందరినీ తరిమేయాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. మా ఊరికి వచ్చి నీ పెత్తనం ఏంటి? మాపై నీ దౌర్జన్యం ఏంటంటూ నిలదీశారు. దీంతో ఆయన కారులో నుంచి కర్రలు, రాడ్లను వైకాపా నాయ కులు బయటకు తీసి టీడీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమై తిరగబ డ్డారు. దీంతో వైసీపీ నాయకులు, అంబటి అల్లుడు ఊరి నుంచి పరారయ్యారు.

LEAVE A RESPONSE