Suryaa.co.in

Andhra Pradesh

దర్శిలో వైసీపీ అరాచకాలపై దేవినేని లేఖ

దర్శి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. బొట్లపాలెం, ఎర్రబోయినపల్లె, తుమ్మపాడు గ్రామాల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలను తమ ఆదీనంలోకి తీసుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. దర్శి నియోజకవర్గానికి అదనపు బలగాలు పంపి శాంతియుతంగా పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE